జగదేవ్పూర్ : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఉచితంగా చేపల పిల్లలను పంపిణీ చేస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ బాలేశంగౌడ్, మండల నాయకులతో కలిసి మర్కుక్, జగదేవ్పూర్ మండలాల్లోని 18 గ్రామాల మత్స్యకారులకు సుమారు రూ. 5.70 లక్షల విలువ చేసే చేప పిల్లలను పంపిణీ చేసి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ కులవృత్తుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఒకప్పుడు మాంసం, చేపలు కావాలంటే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉండేదిని, కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎంగా అయిన తర్వాత ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేస్తున్నా రన్నారు. దీంతో మన రాష్ట్రం చేపలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ కవితాశ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, ముదిరాజ్ సంఘం నాయకులు రాజు, రవి, పరమేశ్వర్, ఉప్పలయ్య, మల్లేశం, జగదేవ్పూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బుద్ద నాగరాజు తదితరులు ఉన్నారు.