దౌల్తాబాద్ : జన్మనిచ్చిన తల్లి దండ్రులను వృద్ధాప్యంలో కొడుకులు, బిడ్డలు కంటికి రెప్పలా చూసుకోవాలని ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వీఆర్ఆర్ గార్డెలో దసరా పండుగ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్రెడ్డితో కలిసి వృద్ధులకు దుస్తులు, చేతికర్రలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తల్లి దండ్రులను, పుట్టిన ఊరును, మాతృ భాషను మారవ కూడదన్నారు. డబ్బు సంపదనలో పడి చాలా మంది కుటుంబాల్లో వారి కన్న పేగు బంధాలను మరిచిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పేద ప్రజలకు సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రణంజ్యోతి శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ ఆది వెంకన్న, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ శేఖర్రెడ్డి, సర్పంచ్లు కొమ్మెర పూజితావెంకట్రెడ్డి, స్పప్నాజనార్దన్రెడ్డి, లతామధుసూదన్రెడ్డి, శ్యామల కుమార్, స్వప్నపూర్ణ, ఎంపీటీసీలు బండారు దేవేందర్,మోహన్రావు,పీఏసీఎస్ డైరెక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.