సిద్దిపేట : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్తోపాటు ఉన్నతాధికారులతో ధాన్యం కొనుగోళ్లపై ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపు వేగవంతం చేసేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం తరలించేందుకు ఇసుక లారీలను సైతం వాడుకోవాలని చెప్పారు. కొనుగోళ్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కొవిడ్ పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.