తొగుట : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే మొదటి వరుసలో ఉన్నదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి కొనియాడారు. సోమవారం ఆయన మండలంలోని పెద్దమాసాన్పల్లి టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ఎన్నికైన బోయిని శ్రీనివాస్ను సన్మానించి మాట్లాడారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ప్రతిపక్షాల నాయకులు ఓర్వలేక అసత్యాలను ప్రచారం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కంది రాంరెడ్డి, మెట్టు స్వామి తదితరులున్నారు.