సిద్దిపేట: జిల్లాలోని అక్కన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. అక్కన్నపేట మండలం మల్లేచెరువు తండాలో తొమ్మిదేండ్ల కుమార్తెను రోకలిబండతో తల్లి కొట్టి చంపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. అయితే ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.