సిద్దిపేట : సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లోనే వారు ప్రజల కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.
ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావాలని కోరుకుంటున్నన్నాని తెలిపారు.ప్రతి ఒక్కరు రెండు డోస్ టీకాలు వేసుకోవాలని, రెండు టీకాలు వేసుకున్న 60సం వయస్సు వారు బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు.మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలని చెప్పారు.