ములుగు, డిసెంబర్ 2 : తాళాలు పగులగొట్టి మొబైల్ శాఫు నుంచి సెల్ఫోన్లను దొంగిలించిన వ్యక్తిని రిమాండ్ చేసినట్లు ఎస్సై రంగ కృష్ణ తెలిపారు. ఎస్సై కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..ములుగు మండలం వంటిమామిడిలోని శివసాయి మొబైల్ షాప్లో బుధవారం అర్ధరాత్రి అచ్చాయపల్లికి చెందిన నక్కిర్తి ముత్యాలు షెటర్ తాళాలు పగులగొట్టి 5 స్మార్ట్ ఫోన్లను దొంగిలించాడు.
కాగా, గురువారం తునికిబొల్లారం శివారులో పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముత్యాలును పట్టుకొని విచారించగా స్మార్ట్ ఫోన్లను దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని వివరించారు. 5 స్మార్ట్ ఫోన్లను రికవరీ చేసి నిందితుడిని రిమాండ్ తరలించినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు.