సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలో వర్షం ముంచెత్తి. మండలంలోని బస్వాపూర్లో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో బస్వాపూర్లోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరాయి.