వర్గల్: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి లేదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీనాజిపేటలో జరిగిన టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించడంపై మండిపడ్డారు. కుర్చీకోసం తపన తప్ప.. తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీదని ఆయన ఎద్దేవా చేశారు. గజ్వేల్లో జరిగిన సభలో ఆ పార్టీ నాయకులు సొంత డబ్బా కొట్టుకోవడానికే సరిపోయిందని విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎడ్యుకేషన్ హబ్, రింగ్రోడ్డు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు, కొండపోచమ్మ ప్రాజెక్టుల నిర్మాణాలు ,రైల్వేలైన్ ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ నాయకులకు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గొల్లకుమార్యాదవ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు వడ్డెపల్లి నాగరాజుతోపాటు 50 మంది కార్యకర్తలు వంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ లత, జడ్పీటీసీ బాలమల్లు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగరాజు, సర్పంచ్ గొల్లలక్ష్మీసత్యంయాదవ్, కో-ఆపరేటివ్ సభ్యుడు యాదగిరి, ప్యాక్స్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, గ్రామకమిటీ అధ్యక్షుడు పెంటాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.