సిద్దిపేట : సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తిలోని థర్మాకోల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో ఓ యూనిట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్సర్క్యూట్ సంభవించి మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే చుట్టుపక్కల వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో పరిశ్రమలోని విలువైన సామగ్రి కాలి బూడిదైనట్లు సమాచారం. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తున్నది.