సంగారెడ్డి : వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ స్టాటర్ను రిపేరు చేస్తూ కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి ట్రైనీ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కామారం రాములు (39) తన పొలం వద్ద మోటర్ స్టాటర్ను రిపేరు చేస్తున్న క్రమంలో రాములు కుడి కాలుకు విద్యుత్ వైరు చుట్టుకొని కరెంట్ షాక్కు గురై అక్కడే కింద పడి మృతి చెందాడు.
మృతుడికి భార్య కవిత ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరాలను వెల్లడించారు. మృతదేహానని పోస్టు మార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా దవాఖానకు తరలించారు.