చేర్యాల/ సిద్దిపేట : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు.
శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు మరికొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
అలాగే కార్తీక మాసం సందర్భంగా కొందరు భక్తులు ఆలయ అవరణలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు
Road accident | టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి
Yadadri | యాదాద్రిలో కార్తీక సందడి..పోటెత్తిన భక్తులు