సిద్దిపేట : జిల్లాలోని గజ్వేల్ సమీకృత మార్కెట్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం సందర్శించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ.. గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో ఇటువంటి సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కలెక్టర్లతో జరిగే భేటీలో గజ్వేల్ మార్కెట్ గురించి ప్రస్తావించనున్నట్లు అదేవిధంగా అదనపు కలెక్టర్లు గజ్వేల్ మార్కెట్ను సందర్శించేలా చూస్తానని సీఎస్ పేర్కొన్నారు.