హైదరాబాద్ : జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాకు చేరుకున్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు పోలీస్ కమిషనరేట్ భవనం, కలెక్టరేట్ భవన సముదాయాన్ని కాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు.
ఎకరం విస్తీర్ణంలో రూ. 4 కోట్ల నిధులతో ఆధునిక సదుపాయాలతో జీ ప్లస్ వన్గా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కార్యాలయం, మొదటి అంతస్తులో నివాస సముదాయం ఉంటుంది.