చేర్యాల : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు పెంపుడు కుక్క అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్ విమర్శించారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి ఓ డ్రామా కంపెనీ ఆర్టిస్టులా మారాడని, దళిత, గిరిజన దండోరా యాత్ర అంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు.
తన నియోజకవర్గానికి ఏమి చేయలేని రేవంత్ దళితులు, గిరిజనులకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. వార్డుకు తొమ్మిది మంది చొప్పున గజ్వేల్ సభకు రావాలని రేవంత్ పిలుపునిచ్చాడని, ఆయన సభలకు ప్రజలు రావడం లేదని, అక్కడక్కడ మిగిలి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే వస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై రేవంత్ చేస్తున్న విమర్శలు మానుకోవాలని, తన మాటతీరును సైతం మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా మారడంలేదని ఇక విద్యార్థి లోకం ఆయన పద్ధతి మార్చుకునేలా చర్యలు తీసుకుంటుందన్నారు.
సీఎం కేసీఆర్ భిక్షతోనే నేడు రేవంత్రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవులు అనుభవిస్తున్నారని, కానీ వారు ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే జైలు, బెయిల్ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు, రేవంత్రెడ్డిది ఐరన్ లెగ్ అని, ఏ పార్టీలో చేరితే అది నాశనమవుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో సంతోషంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.