సిద్దిపేట : సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అర్హులకు డబుల్ బెడ్రూంలు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆదివారం ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణకు వార్డుకొకటి చొప్పున 20 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అర్హుల నుంచి ఈ నెల 21 వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పరిధిలో అర్హత గల వారికి పంపిణీ చేసేందుకు సకల వసతులతో 1,200 డబుల్ బెడ్రూంలను ప్రభుత్వం నిర్మించింది. ఇండ్ల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకావడంతో నిరు పేదలు హర్ష వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.