చేర్యాల : ద్విచక్ర వాహనం వెనుక చక్రంలో కొంగు చిక్కుకుని ఓ మహిళ మృతి చెందిన ఘటన చేర్యాల-ఆకునూరు రహదారిలోని సుందరయ్యనగర్ వద్ద గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నంగునూరు మండలం గణపురం గ్రామానికి చెందిన చేర్యాల పద్మ(50) తన చిన్న కుమారుడితో కలిసి చేర్యాల మండలంలోని కడవేర్గు గ్రామంలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న సంవత్సరికానికి బైక్పై వెళ్తున్నది.
సుందరయ్యనగర్ వద్దకు రాగానే కొంగు ఒక్కసారిగా ద్విచక్ర వాహనం వెనుక చక్రంలో చిక్కుకుపోవడంతో పద్మ ఒక్కసారిగా కిందపడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్ఐ రాకేశ్ ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతురాలి భర్త కొద్ది రోజుల క్రితమే మరణించగా, ఆమెకు ఇద్దరు కుమారులున్నారు.