పల్లె ప్రగతితో మారిన బుస్సాపూర్ గ్రామం
అందుబాటులోకి వచ్చిన డంపింగ్ యార్డు,పల్లె ప్రకృతి వనం
గ్రామంలో ఎటు చూసినా పచ్చదనం
సీసీ రోడ్లతో మరింత అందం
అంగన్వాడీ, గౌడ సంఘం భవనం
ప్రతి ఆదివారం స్వచ్ఛందంగా శ్రమదానం
నగదు రహిత లావాదేవీల్లో ముందంజ
సిద్దిపేట అర్బన్, జూలై 29 ;నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామం నేడు ప్రగతి పథంలో పయనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనం, ఎరువు తయారు చేసే డంపింగ్యార్డు, వైకుంఠధామం నిర్మాణాలతో గ్రామం ప్రగతి బాట పట్టింది.
గ్రామ ముఖ చిత్రం..
సిద్దిపేట జిల్లా కేంద్రానికి 14కి.మీలో దూరంలో సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్ గ్రామం ఉంది. గ్రామ జనాభా 1602 కాగా, 766 స్త్రీలు ఉండగా, 836 మంది పురుషులు ఉన్నారు. గ్రామంలో 411 కుటుంబాలు ఉన్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామంలో 35కు పైగా పాడుబడిన ఇండ్లను కూల్చివేశారు. సర్పంచ్ కేదారి సదాశివరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో 20 సీసీ కెమెరాలు బిగించారు. ప్రతినెలా ప్రభుత్వం ద్వారా 328 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. ఇప్పటి వరకు రైతుబీమా ద్వారా 6 మంది రైతులకు పరిహారం అందింది. 31 మందికి కల్యాణలక్ష్మి ద్వారా ముగ్గురు షాదీముబారక్ పథకాల ద్వారా సహాయం పొందారు. మూడేండ్లలో 22 మంది సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం పొందినట్లు సర్పంచ్ సదాశివరెడ్డి వెల్లడించారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామం..
గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇంటింటికీ చెత్త సేకరించి సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు రూ.7.5లక్షలతో డం పింగ్యార్డు, రూ.28 లక్షలతో సామూహిక ఫంక్షన్హాల్, రూ.2.5 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ. 10 లక్షలతో అంగన్వాడీ భవనం, గ్రామపంచాయతీ ఆవరణలో ఓపెన్ జిమ్, గౌడ సంఘం భవ నం, గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించగా, ఇటీవల ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. రూ.10 లక్షలతో మహిళా భవనం, రూ.5 లక్షలతో లైబ్రరీ, రూ.12, రూ.10లక్షలతో ఎస్సీలకు కమ్యూనిటీ హాల్, గొర్ల షెడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రామంలోని నర్సరీలో 10వేల మొక్కలు హరితహారం కోసం సిద్ధంగా ఉంచారు.
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
గ్రామంలో విశాలమైన పల్లె ప్రకృతి వనం సర్పంచ్ సదాశివరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించారు. పూల మొక్కలు, పలు రకాల ఔషధ మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలోకి వెళ్లగానే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా చెట్ల ను, పార్కును తీర్చిదిద్దారు. చెత్త నుంచి ఎరువు తయారు చేసే డంపింగ్యార్డును సైతం అం దంగా పచ్చని మొక్కలతో తీర్చిదిద్దారు.
పలు స్ఫూర్తిదాయక కార్యక్రమాలు..
గ్రామ ప్రజలు ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని పక్కాగా అమలు చేసి విజయం సాధిస్తారు. నగదు రహిత లావాదేవీల్లో గ్రామం జిల్లాలో ఆదర్శంగా నిలించింది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్రావు స్వయంగా పలుమార్లు ప్రస్తావించి గ్రామస్తులను అభినందించారు. ప్రజాప్రతినిధుల చొరవతో కొంతమంది మహిళలతో జ్యూట్ బ్యాగుల తయారీ చేయించి విజయం సాధించారు. మహిళలు, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి ఆదివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తారు.
పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధి
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు పాడుబడిన ఇండ్లతో ఉన్న గ్రామం నేడు పచ్చగా, పరిశుభ్రంగా మారింది. ప్రభుత్వ సహకారంతో అన్నివిధాల గ్రా మాన్ని అభివృద్ధి చేసుకున్నాం. పల్లె ప్రకృతి వనంలో పలు రకాల మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. మంత్రి హరీశ్రావు సూచనలు, సహకారంతో రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తాం. గ్రామం పరిశుభ్రంగా మారడానికి గ్రామస్తుల సహకారం మరువలేనిది.
గ్రామస్తుల సహకారం చాలా బాగుంది..
గ్రామంలో ఏ కార్యక్ర మం చేపట్టినా గ్రామస్తు లంతా ఐకమత్యంతో ఉండి సహకరిస్తారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు సమష్టి భాగస్వామ్యంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశాం. చెత్త సేకరణ గురించి ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాం. గ్రామంలో 100శాతం పన్నులు వసూలు చేస్తు న్నాం. భవిష్యత్లో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం.