ప్రాజెక్టులవారీగా వానకాలం సాగునీటి ప్రణాళిక
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగుకు భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తం 39.35 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని సాగునీటిపారుదలశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) ప్ర తిపాదనలు సిద్ధం చేసింది. సంబంధిత యాక్షన్ ప్లాన్పై టెరిటోరియల్వారీగా ఆయా చీఫ్ ఇంజినీర్ల నుంచి ఈ ఎన్సీ మురళీధర్ వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ప్రా జెక్టులవారీగా నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం అంశాలపై చర్చించారు. ఈ ఏడాది వానకాలం సీజన్లో అన్ని ప్రాజెక్టుల కింద 39.35 లక్షల ఎకరాలకు సాగునీరు అం దించాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఎస్సారెస్పీ ఎగువ ఆయకట్టు 4,62,920 ఎకరాలకు, దిగువన 7,75899 ఎకరాల ఆయకట్టుకు, నాగార్జునసాగర్ పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. వీటిని త్వరలోనే ప్రభుత్వానికి ఇస్తారు.
జూలై 1న ఆర్ఎంసీ సమావేశం
రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) మూడో సమావేశాన్ని జూలై ఒకటో తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) గురువారం లేఖలు రాసింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించిన ప్రొటోకాల్, ఉమ్మడి ప్రాజెక్టుల రూల్ కర్వ్, డ్యామ్ సేఫ్టీ తదితర అంశాల అధ్యయనం కోసం కేఆర్ఎంబీ చీఫ్ ఇంజినీర్ రవికుమార్ పిైళ్లె మెంబర్ కన్వీనర్గా ఆర్ఎంసీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ప్రస్తుతం ఆ మూడో సమావేశాన్ని ఒకటిన నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది.
చెన్నై తాగునీటి సరఫరాపై నేడు సమావేశం
చెన్నై తాగునీటి సరఫరాకు సంబంధించి కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో కూడిన ప్రత్యేక కమిటీ సమావేశం శుక్రవారం వర్చువల్గా కొనసాగనున్నది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతోపాటు కమిటీ సభ్యులకు కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, ప్రత్యేక కమిటీ కన్వీనర్ డీఎం రాయ్పురే గురువారం లేఖలు రాశారు. 2022-23 నీటి సంవత్సరానికి సంబంధించి చెన్నై నగరానికి తాగునీటి సరఫరా అంశంపై సమావేశంలో ప్ర ధానంగా చర్చించనున్నారు. గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిపైనా కమిటీ సభ్యులు చర్చించనున్నారు. చెన్నై తాగునీటి సరఫరాకు శ్రీ శైలం ప్రాజెక్టుపై మరో లిఫ్ట్ను ఏర్పాటుచేయాలని గత సమావేశంలో ఏపీ ప్రతిపాదించగా, తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకించింది.