సిద్దిపేట జిల్లాలో 2.77 సెం.మీ వర్షపాతం
అత్యధికంగా సిద్దిపేట అర్బన్లో 5.9 సెం.మీ
సంగారెడ్డి జిల్లాలో సరాసరి 1.57 సెం.మీ వర్షపాతం నమోదు
అత్యధికంగా సిర్గాపూర్లో 4 సెంటీ మీటర్లు
మెదక్ జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షం
నాలుగు రోజుల పాటు వానలు పడుతాయని వాతావరణశాఖ వెల్లడి
సిద్దిపేట, జులై 21 : సిద్దిపేట జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా తేలికపాటి వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి 2.77 సె.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా సిద్దిపేట అర్బన్లో 5.9 సె.మీ వర్షం పడింది. అత్యల్పంగా హుస్నాబాద్లో 0.85 సె.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా దుబ్బాక మండలంలో 5.8, సిద్దిపేట రూరల్లో 3.2 , చిన్నకోడూరులో 2.2, బెజ్జంకిలో 1.48, కోహెడలో 1.2, అక్కన్నపేటలో 1.66, నంగునూరులో 2.21, తొగుటలో 2.9, మిరుదొడ్డిలో 4.1, దౌల్తాబాద్లో 3. 08, రాయపోల్ 1.1, వర్గల్లో 1.3, ములుగులో 0.9, మర్కూక్లో 2.5, జగదేవ్పూర్లో 2.2, గజ్వేల్లో 2.4, కొండపాకలో 2.6, కొమురవెల్లిలో 2.5, చేర్యాలలో 2.9, మద్దూరులో 4.9, నారాయణరావుపేటలో 3.4, ధూళిమిట్టలో 4.8 సె.మీ వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి, జూలై 21: సంగారెడ్డి జిల్లాలో బుధవారం సరాసరి 1.57 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్గాపూర్ మండలంలో 4 సెంటీ మీటర్లు వర్షం పడిందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో వర్షాలకు వాగులు, వంకలు వరద పారుతూ చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకున్నాయి. మరో నాలుగు రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
మెదక్ జిల్లాలో..
మెదక్, జూలై 21 : మెదక్ జిల్లాలో రెండు రోజులుగా చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద వస్తున్నది. జిల్లావ్యాప్తంగా సరాసరి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నార్సింగి మండలంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రామాయంపేటలో 2.9, నిజాంపేటలో 2.8, హవేళీఘనపూర్లో 2.7, చిన్నశంకరంపేటలో 2.7, చేగుంటలో 2.5, టేక్మాల్లో 2.7, మెదక్లో 2, పెద్దశంకరంపేటలో 2, రేగోడ్లో 1.7, కొల్చారంలో 1.3, చిలిపిచెడ్లో 1.4, కౌడిపల్లిలో 1.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.