అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 2,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. 81,763 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. వైరస్ ప్రభావంతో 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో 18 మంది మృతి చెందగా.. తాజాగా 3,034 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏపీలో 19,26,988 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో మొత్తం 2,31,30,708 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,87,236 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,042 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో వివరించింది.