హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును కలిసి ఆశీర్వాదం తీసుకొన్నారు. అంతకుముందు ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని, తెలంగాణను హరితవనంగా మార్చాలని పిలుపునిచ్చారు.