కల్హేర్, జూలై 9 : దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం దళిత సాధికారత పథకాన్ని హర్షిస్తూ సిర్గాపూర్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత సాధికారత పథకంతో దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతోపాటు వ్యాపార, విద్య, ఉద్యోగ రంగాల్లో ముందడుగు వేస్తారన్నారు. దళితుల్లో పేదరికం లేకుండా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా దళిత కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలో పచ్చదనం ఉట్టిపడుతున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఎంపీపీ మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవ్రావు పటేల్, నాయకులు రాజు, నర్సింహులు, బాలయ్య, రమేశ్, నాగిశెట్టి, సందీప్ షేట్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సిర్గాపూర్ మండల పరిధిలోని సంగెమ్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెల్లో ప్రగతి సాధనకు ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి బాటలో పయనించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఎంపీపీ మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరావు, సర్పంచ్ రవి, ఎంపీటీసీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పల్లెలు పచ్చని వనాలు కావాలి:నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
పల్లెలు పచ్చని వనాలు కావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని నారాయణఖేడ్ ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో పల్లెప్రకృతి వనం, వైకుంఠధా మం, అంగన్వాడీ ప్రహరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పల్లె ప్రగతితో గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలని సూచించారు. పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని తుర్కపల్లి గ్రామాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి పరమేశ్, ఎంపీటీసీ అశోక్రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, విజిలెన్ కమిటీ సభ్యులు రవీందర్నాయక్, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.