బెంగళూరు: వివాదాస్పద వీడియో వైరల్ అయిన కేసు దర్యాప్తుపై ఘజియాబాద్ పోలీసులకు ఆసక్తి లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ట్విట్టర్ ప్లాట్ఫామ్పై వివాదాస్పద వీడియోను ఒక వ్యక్తి పోస్ట్ చేసిన అంశంపై ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి వ్యతిరేకంగా ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేయాలని ఘజియాబాద్ పోలీసులు కోరు కోవడం లేదని మంగళవారం జరిగిన విచారణలో జస్టిస్ జీ నరేందర్ వ్యాఖ్యానించారు.
జై శ్రీరాం.. వందే మాతరం అని నినాదాలు చేయని ఒక సీనియర్ సిటిజన్ గడ్డం కత్తిరించిన ద్రుశ్యాలతో కూడిన వీడియోను ఒక వ్యక్తి అప్లోడ్ చేశాడు. ట్విట్టర్లో ఈ వీడియో అప్లోడింగ్కు, ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి సంబంధం ఏమిటని జస్టిస్ నరేందర్ ప్రశ్నించారు. దీనికి ప్రాతిపదిక ఏమిటని నిలదీశారు.
ట్విట్టర్ ఇండియా, ట్విట్టర్ ఇంక్ వేర్వేరని న్యాయమూర్తి గుర్తు చేశారు. ట్విట్టర్ ఇండియా మధ్యవర్తిత్వ సంస్థ కూడా కాదని పేర్కొన్నారు. ట్విట్టర్ ఇండియా, ట్విట్టర్ ఇంక్ వేర్వేరైనప్పుడు దర్యాప్తు ఎక్కడ జరుగుతున్నదని ప్రశ్నించారు. పోలీసులు రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)ని సందర్శించారా? అని నిలదీశారు.
కేసు దర్యాప్తును కలగాపులగం చేయొద్దని ఘజియాబాద్ పోలీసులకు హైకోర్టు సూచించింది. ఒక వ్యక్తి అప్లోడ్ చేసే వీడియోపై ట్విట్టర్ ఇండియా ఎండీ తనకు నియంత్రణ ఉండదని చెబుతున్నారని గుర్తు చేసింది. కొన్ని లక్ష్యాలను సాధించడం కోసం భయపెట్టడం తప్ప మరొకటి కాదని స్పష్టం చేసింది.
ఈ కేసు విషయమై ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరిని ప్రశ్నించాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయొచ్చునని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
కర్నాటకం : యడియూరప్పపై టూరిజం మంత్రి తిరుగుబాటు
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ప్రపంచంలోనే ఎత్తయిన గుర్రం బిగ్ జాక్ ఇకలేదు..!
విస్తారా ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్
రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు… భారీ డిస్కౌంట్స్…
ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి సడలింపులు..
ఏడాదిలో మూడోసారి : టాటా కార్ల ధరలకు రెక్కలు!
రూ.15 లక్షల కోట్లు.. ప్రపంచ కుబేరుల్లో ఇంకా టాప్లోనే బెజోస్
ఆంక్షలపై తగ్గేందుకు సౌదీ ససేమిరా.. సంక్షోభం ముంగిట ఓపెక్?