హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడువరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల వద్ద ఉపరితలద్రోణి ఏర్పడింది. ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.