భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలి
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
59, 30వ డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమం
హన్మకొండ, జూలై 4 : మొక్క నాటిన వారే సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. పట్టణప్రగతి, హారితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని 59వ డివిజన్ స్నేహానగర్, 30వ డివిజన్ శ్రీనివాసనగర్ కాలనీలో పర్యటించారు. కాలనీ వాసుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని, అందుకు విరివిగా మొక్కలు నాటాలన్నారు. వ్యాధులు ప్రబలకుంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వరంగల్ను ప్లాస్టిక్ రహిత, పచ్చని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీ ఆర్గనైజేషన్ పేరుతో అభిరాం, వారి మిత్రులు పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నారన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్లు ఇమ్మడి లోహిత, గుజ్జుల వసంత, రెంటాల కేశవరెడ్డి, చిన్న, డీఈ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.