ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో భయానక ఘటన చోటుచేసుకుంది. లాహోర్లోని బర్కత్ మార్కెట్లో భారీ సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో ఒక్కసారిగా బర్కత్ మార్కెట్ దద్దరిల్లింది. ఈ పేలుళ్ల ధాటికి మార్కెట్లో పెద్దసంఖ్యలో దుకాణాలు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ప్రస్తుతం ఈ సిలిండర్ల పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సిలిండర్లు పేలిపోయాయి. అయితే పేలుళ్లలో ప్రాణనష్టం, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బర్కత్ మార్కెట్లోని గ్యాస్ సిలిండర్లు ఉంచిన సెక్షన్లో పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.
అయితే ఒకదాని తర్వాత ఒకటి సిలిండర్ల పేలుడు కొనసాగుతుండటంతో సహాయక చర్యలు చేపట్టడం సాధ్యపడటం లేదని సమాచారం.