పెద్దశంకరంపేట, జూన్ 27: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట పట్టణంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, కొనుగోలు కేంద్రాలు, రైతుబీమా, రైతుబంధు పథకాలు అమలు చేస్తూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టు బాటు ధర కల్పిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. జొన్నలు క్వింటాలుకు రూ.2620 మద్దతు ధర ఇస్తుందన్నారు. మండలంలోని రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలన్నారు.
రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన సమన్కు రూ.20 వేలు, జూకల్ గ్రామానికి చెందిన లక్ష్మికి రూ.60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, పీఏసీఎస్ చైర్మన్ సిద్ధ సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బోండ్ల దత్తు,సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుంట్ల రాములు, రైతు బంధు మండల అధ్యక్షుడు సురేశ్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు అలుగుల సత్య నారాయణ, వేణుగోపాల్గౌడ్, ప్రకాశ్, మానిక్రెడ్డి, శంకర్గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు యాదూల్, అడివయ్య, సీఈవో రవీందర్ ఉన్నారు.