వికారాబాద్ : పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దుదామని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ అధ్యక్షతన జరిగిన పరిగి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పట్టణ పరిధిలో రూ.10కోట్ల విలువ చేసే పనులు కొనసాగుతున్నాయని, మిగతా రూ.5కోట్ల విలువ చేసే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. ప్రతి వార్డులోను ప్రాధాన్యతా క్రమంలో పనులకు నిధుల కేటాయింపు జరపాల్సిందిగా అధికారులకు సూచించారు.
పట్టణంలోని మినీ స్టేడియం, తిరుమల వెంచర్ ప్రాంతంలో రెండు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జూలై ఒకటి నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రతి వార్డు పరిధిలోను పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. చెత్త సేకరణ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేయాలని, రోడ్లపై చెత్త తొలగింపుకు చర్యలు చేపట్టాలన్నారు.
పట్టణ పరిధిలోని అన్ని వార్డులలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడంతోపాటు నీటి సరఫరా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, వైస్ చైర్పర్సన్ కె.ప్రసన్నలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి