న్యూఢిల్లీ: రాబోయే 5 రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చెరి, కేరళ కూడా ఉన్నాయి. బుధవారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. మిగిలిన నాలుగు రోజులు కూడా మన రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు కురవనున్నాయి.