బాలబాలికలు అన్నిరంగాల్లో రాణించాలి

వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
సిద్దిపేట టౌన్, జనవరి 26 : బాలబాలికలు అన్నిరంగాల్లో తమదైన ముద్రతో రాణించి అభివృద్ధి చెందాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట బాలసదనం పిల్లలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాలికలు బాగా చదివి సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, ఐక్యతతో ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు. అంతకు ముందు బాలసదనం చిన్నారులు బాలహక్కుల పై ఉపన్యాసం, ఇంటరాక్షన్, పిల్లల కేస్ స్టడీస్ సిద్దిపేట బాలల పరిరక్షణ కమిటీ చేస్తున్న సేవలపై పాటలతో గవర్నర్ను ఆకట్టుకున్నారు. చక్కగా ఉపన్యసించిన వారిపై గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. కార్యక్రమంలో మహిళా శిశుసంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్ దివ్య దేవరాజన్, జిల్లా సంరక్షణ అధికారి రాంగోపాల్రెడ్డి, బాలరక్ష భవన్ కో-ఆర్డినేటర్ మమత, డీసీపీవో రాము, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిద్దిపేట బాల సదనం సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో జట్టు : రాందాస్ అథవలే
- తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ