హైదరాబాద్ : నాంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ కమ్యూనిటీ హాల్లో కొందరు యువకులు బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాండ్ మోగించారు. బ్యాండ్ మోగించడంపై మరో వర్గం యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాండ్ మోగించడం వల్ల స్థానికులకు ఇబ్బందిగా ఉందన్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. బాధిత యువకులు నాంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.