తిరుమల, జూన్, 20: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఆదివారం ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి దగ్గర భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శేఖర్ రెడ్డి, కుమారగురు తదితరులు పాల్గొన్నారు.