కథానాయికగా గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు ప్రయోగాలకు సిద్ధమంటోంది అదాశర్మ. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తోన్న ఆమె కెరీర్లో తొలిసారి రొమాంటిక్ కామెడీ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. హీరో నాని నిర్మాణంలో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం ‘మీట్క్యూట్’. నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓ నాయికగా అదాశర్మ ఎంపికైంది. ఈ సినిమాలో ఇదివరకు ఎప్పుడూ చేయని ఓ సరికొత్త పాత్రలో తాను కనిపించబోతున్నట్లు అదాశర్మ చెప్పింది. ‘యాక్షన్, ప్రేమకథలతో పాటు అన్ని జోనర్లలో నటించాను. కానీ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. లాక్డౌన్ సమయం కావడంతో జూమ్ కాల్స్ ద్వారా ఈ పాత్రకు సంబంధించిన రిహార్సల్స్ పూర్తిచేశా. సెట్స్లో అడుగుపెట్టడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపింది. ఈ సినిమాలో మరో నాయికగా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ తిపిరినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం.