ముషీరాబాద్, జూన్ 18: సంగారెడ్డి జిల్లాలో నిర్మించ తలపెట్టిన జలాశయానికి బసవేశ్వర-సంగమేశ్వర ప్రాజెక్టుగా నామకరణం చేయడంపై తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుల దైవమై న బసవేశ్వరుని పేరుతో ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం తో వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ ప్రతినిధులు శివ శరణప్ప, గుండప్ప, ఈశ్వర ప్రసాద్, సతీశ్ కుమార్, బస్వరాజ్, శ్రీనివాస్, రాజ్కుమార్, మధుశేఖర్, వీరేష్, విజయరాం, శ్రీనివాస్ పాటిల్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ బీబీ పాటిల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ను తన ఇంట్లో కలిసి ఘనంగా సత్కరించారు.