న్యూఢిల్లీ, జూన్ 11: కొవిడ్ పేషంట్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కవాచ్ పర్సనల్ లోన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రూ.5 లక్షల వరకు రుణాన్ని కేవలం 8.5 శాతం వడ్డీకే మంజూరు చేయనున్నది. ఎలాంటి తనఖాలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఈ రుణాన్ని 60 నెలల్లో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించింది బ్యాంక్. ఈ రుణాలను తను లేదా తన కుటుంబ సభ్యుల కొవిడి ట్రీట్ మెంట్ కోసం అయ్యే ఖర్చులను భరించేందుకు ఉద్దేశించారు. ఇప్పటికే ట్రీట్మెంట్ కోసం అయి ఖర్చుల కోసం కూడా ఈ రుణాలను వినియోగించ వచ్చు.