నిజాంసాగర్/ పిట్లం / నాగిరెడ్డిపేట్/ రామారెడ్డి/ జూన్ 11: నిజాంసాగర్ మండలం అచ్చంపేట, నిజాంసాగర్ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి సంజీవ్రావు శుక్రవారం పరిశీలించారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించి, వనంలో రోడ్లను బాగు చేయాలని, మొరం పనులు పూర్తిచేయాలని సూచించారు.అచ్చంపేట గ్రామంలోని కోతుల ఆహారశాలలో పండ్ల మొక్కలను పరిశీలించారు. అనంతరం నిజాంసాగర్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మండలంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారి రాధాకిషన్ను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఏఏ పంటలు సాగు చేస్తున్నారు, నీటి వసతి, విత్తనాలు, ఎరువులు తదితర అంశాలపై వ్యవసాయశాఖ అధికారి అమర్ప్రసాద్ను అడిగారు.
సుల్తాన్నగర్లో వాటర్ డే
మండలంలోని సుల్తాన్నగర్ గ్రామంలో శుక్రవారం వాటర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని పల్లె ప్రకృతివనంతోపాటు రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలకు మండల పంచాయతీ అధికారి అబ్బాగౌడ్ నీరు పోశారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకుడు హైమద్హుస్సేన్ ఉన్నారు.
మొక్కలను సంరక్షించాలి
నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని పిట్లం మండల ప్రత్యేకాధికారి జగన్నాథచారి అన్నారు. మండలంలోని కోమటిచెరువు తండా నర్సరీలో మొక్కల పెంపకాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో బ్రహ్మం, సర్పంచ్ దేవారావు, పంచాయతీ కార్యదర్శి ప్రకాశ్ ఉన్నారు.
నర్సరీ పనుల పరిశీలన
నాగిరెడ్డిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ పనులను ఎంపీడీవో రఘు శుక్రవారం పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను ఈసీ మధును అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా నాటేందుకు మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో శ్రీనివాస్ ఉన్నారు.
పల్లె ప్రకృతి వనం..
నాగిరెడ్డిపేట్ మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాన్ని జడ్పీటీసీ సభ్యుడు మనోహర్రెడ్డి, ఎంపీడీవో రఘు శుక్రవారం పరిశీలించారు. ప్రకృతివనంలో నాటిన మొక్కల వివరాలను సర్పంచ్ బాల్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎంపీవో శ్రీనివాస్, ఈసీ మధు ఉన్నారు.
రామారెడ్డిలో..
రామారెడ్డి మండలం కన్నాపూర్తండాలో వాటర్ డేలో భాగంగా ఎంపీడీవో విజయ్కుమార్ మొక్కలకు నీరు పోశారు. అనంతరం నర్సరీని సందర్శించి మొక్కలను సంరక్షించాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట సర్పంచ్ చందర్ నాయక్, ఏపీవో ధర్మారెడ్డి, ఉప సర్పంచ్ శర్మన్నాయక్, టీఏ శ్రీనివాస్, కార్యదర్శి వై.రాములు తదితరులు ఉన్నారు.