నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. గాంధారి మండలంలో మంగళవారం రాత్రి శివాజీ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో శివప్రసాద్ రెడ్డి పాత్రపై వరుసగా సీపీకి ఫిర్యాదులు అందాయి. ఎస్ఐ.. మృతుడి భార్య (కానిస్టేబుల్)తో వివాహేతర సంబంధం కొనసాగించడంతో జీవితంపై విరక్తి చెందిన శివాజీ బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో విచారణ నిర్వహించిన ఉన్నతాధికారులు ఎస్ఐ శివప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్తోపాటు ఎస్ఐ శివప్రసాద్ను త్వరలో పోలీసులు రిమాండ్కు తరలించనున్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.