ఢిల్లీ ,జూన్ 11: ‘ఖాదీ ప్రకృతిక్ పెయింట్’ తయారీ, విక్రయ హక్కులను ఎవరికీ ఇవ్వలేదని ఖాదీ,గ్రామీణ పరిశ్రమలకమిషన్ (కెవిఐసి) చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై తమ సంస్థ చట్టపరంగా చర్యలను తీసుకుంటున్నదని వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. ఇప్పటికే ఖాదీ పేరును దుర్వినియోగం చేసిన వెయ్యి సంస్థలపై చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.