వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ డైరెక్టర్ శివానంద్
జిల్లాకేంద్రంలో ఫర్టిలైజర్ షాపుల తనిఖీ
ఆసిఫాబాద్ టౌన్, జూన్ 10 : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్టు నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ టాస్క్ఫోర్స్ డిప్యూటీ డైరెక్టర్ శివానంద్ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని పలు విత్తనాల దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. లైసెన్స్, సోర్స్ సర్టిఫికెట్, బిల్లులు, విత్తనాల ప్యాకెట్లపై ముద్రించిన వివరాలు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. ఆయన వెంట టాస్క్ఫోర్స్ డీఎస్పీ సురేశ్, సర్టిఫికెషన్ ఆఫీసర్ సంతోష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస రావు, ఏవో ఖాదర్ హుస్సేన్, తదితరులు ఉన్నారు.
దహెగాం, జూన్ 10 : మండలంలో ఇటీవల పెద్దమొత్తంలో నకిలీ విత్తనాలు దొరకడంతో కాగజ్నగర్ రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి దహె గాం, ఐనం, పోలంపల్లి, కల్వాడ, కొంచవెల్లి, చంద్రపల్లి, తదితర గ్రామాల్లోని ఫర్టిలైజర్ షాపులతో పాటు అనుమానితుల ఇండ్లల్లో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు, మందులను రైతులు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. నకిలీ విత్తనాలు, ైగ్లెఫోసెట్తో భూసారం తగ్గుతుందని చెప్పారు. తనిఖీల్లో ఎస్ఐ రఘుపతి, పీఎస్ఐ సందీప్, పోలీస్ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కౌటాల, జూన్ 10: మండలంలోని ముత్తంపేట, శీర్షా గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను ఏవో పాలకుర్తి రాజేశ్ తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక ధరలకు విక్రయించవద్దన్నారు.