గోశాల ప్రారంభోత్సవంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం
మక్తల్ రూరల్, జూన్ 4 : గోసంపదను పరిరక్షించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మక్తల్ మండలం పంచదేవ్పాడ్ గ్రామశివారులో డాక్టర్ బాలనర్సయ్య వ్యవసా య క్షేత్రంలో ఏర్పాటు చేసిన గోశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే చిట్టెం మాట్లాడుతూ పూర్వం నుంచి గోశాలలను ఏర్పాటు చేసి గోవులను పెంచి పూజించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. పశువుల పెంపకంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఆవుపేడతో ఎరువులను తయారు చేసి పంటలకు వేయడంవల్ల అధిక దిగుబడి వస్తుందన్నారు. పంచదేవ్పాడ్లో గోశాలను ఏర్పాటు చేయడంపై నిర్వాహకుడు డాక్టర్ బాలనర్సయ్యను ఎమ్మెల్యే చిట్టెం అభినందించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా, మక్తల్ ఎంపీపీ వనజ, సర్పంచులు కల్పనాష్ణ, దత్తప్ప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.