ముంబై, జూన్ 2:ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీనష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 350 పాయింట్ల మేర పతనమైంది. మంగళవారం సూచీ భారీ లాభాల్లో ప్రారంభమై, రోజంతా ఊగిసలాటలో కనిపించి, చివరకు దాదాపు స్థిరంగా ముగిశాయి.ఈరోజు మొత్తం 23 కంపెనీలు ఫలితాలను వెల్లడిస్తున్నాయి. వీటిల్లో మదర్సన్ సుమీ, ఎంటీఏఆర్ టెక్నాలజీస్, ముత్తూట్ ఫినాన్స్, పీవీఆర్ తదితర కంపెనీలు ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి విలువ 16 పైసలు పతనమై రూ.72.44 వద్ద ట్రేడ్ అయింది.