న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.195 పెరిగి రూ.48,608కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,413 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర స్వల్పంగా పెరుగడమే ఇవాళ పసిడి ధర స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక, వెండి ధర ఇవాళ స్థిరంగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.15 తగ్గి రూ.70,521కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.70,536 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,905 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 27.95 అమెరికన్ డాలర్లు పలికింది.