Siddipet
- Dec 15, 2020 , 00:10:22
VIDEOS
ప్రతి మొక్కను సంరక్షించాలి

- అదనపు కలెక్టర్ ముజమ్మీల్ఖాన్
సిద్దిపేట కలెక్టరేట్ : ఎవెన్యూ ప్లాంటేషన్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అదనపు కలెక్టర్ ముజమ్మీల్ఖాన్ కోరారు. సిద్దిపేట కలెక్టరేట్లో సోమవారం డీఆర్డీఏ పీడీ గోపాల్రావు, జడ్పీ సీఈవో శ్రవణ్, పంచాయతీ ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నాటిన మొక్కల్లో 85 శాతం జీవించే విధంగా చూడాలన్నారు. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు వంద శాతం సంరక్షించాలన్నారు. మొక్కలు ఎండిపోతే సంబంధిత గ్రామాల సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చి పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. శ్మశానవాటికలను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. సమీక్షలో ఏపీడీ కౌసల్య, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!
MOST READ
TRENDING