మహబూబాబాద్ : జిల్లాలోని మరిపెడ మండలం తండా ధర్మారం శివారు సీతారాంపుర తండాకు చెందిన గిరిజన యువతి(18) పై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన నేరస్తున్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థిని మరిపెడ గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీలో డిగ్రీ చదువుతోంది. యువతి మృతి పట్ల మంత్రి సంతాపం తెలిపారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అమ్మాయి తండ్రితో మాట్లాడి ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
యువతి శనివారం ఉదయం ఉపాధి హామీ కూలి పనికి వెళ్లి వస్తుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రాజేష్ యువతికి దారి మద్యలో కలిసి బండిపై తీసుకొని పక్కనే ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లాడు. అయితే అక్కడ ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో రాజేష్ యువతిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా వెల్లడించారు.