హాలియా, మే 28 : కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియా పీహెచ్సీలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరిస్తున్నారన్నారు. రా ష్ట్రంలో లాక్డౌన్ విధించిన తరువాత కరోనా పాజిటివ్ కేసులె గణనీయంగా తగ్గాయన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మర్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, ఎడమకాల్వ మాజీ వైస్ చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి, ఆవుల పురుషోత్తం, కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, అన్నెపాక శ్రీను, ప్రసాద్నాయక్, హెల్త్ అసిస్టెంట్లు సైదులు, జావీద్ పాల్గొన్నారు.
హాలియాలో
హాలియాలో 154 మంది సూపర్ స్ప్రెడర్లకు టీకా వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జర్నలిస్టులు 3, పెట్రోల్ బంక్, ఎల్పీజీ సిబ్బంది 56, రేషన్ డీలర్లు, వర్కర్లు 44, ఫర్టిలైజర్ సిబ్బంది 51 మందికి టీకా వేసినట్లు చెప్పారు.
మిర్యాలగూడలో ..
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలోని బకల్వాడీ పాఠశాలలో తొలిరోజు 321 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి తెలిపారు.
అడవిదేవులపల్లిలో..
అడవిదేవులపల్లి : స్థానిక పీహెచ్సీలో 40 మంది స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి ఉపేందర్ తెలిపారు. అలాగే 56 మందికి కరోనా పరీక్షలు చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. కరోనా సోకిన వారికి కిట్లు అందజే సినట్లు ఆయన తెలిపారు.
మర్రిగూడలో ..
మర్రిగూడ/మునుగోడు : ఆయా మండల కేంద్రా ల్లో 40, 36 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమాల్లో హెల్త్ సూపర్ వైజర్ ప్రసాద్, డా.శంకర్నాయక్, జె.వెంకటేశ్వర్లు, మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.