ఎటావా: కోవిడ్-19 ముప్పు పొంచి ఉన్నా దేశవ్యాప్తంగా వివాహాలు జోరుగా సాగుతున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని ఒక వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకలో వధువు అస్వస్థతతో కుప్పకూలిపోయారు.
ఆమెకు చికిత్సనందించేందుకు వచ్చిన వైద్యుడు అప్పటికే వధువు మరణించిందని ధ్రువీకరించారు. ఆమె గుండెపోటు వల్ల కుప్పకూలిందని వెల్లడించారు.
అయితే, ఇరు కుటుంబాలు రాజీకి వచ్చాయి. వధువు సోదరికి, వరుడికి వివాహం చేయాలని నిర్ణయించాయి. ఈ ఘటన ఎటావా జిల్లా భర్తానాలోని సమస్పూర్లో రెండు రోజుల క్రితం జరిగింది.
వివాహ వేడుక పూర్తవుతున్న సమయానికి వధువు సురభి.. వరుడు మంజేశ్ కుమార్ పక్కన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. భారీ గుండెపోటు వల్ల మరణించాడని వైద్యుడు తేల్చి చెప్పారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తమకు తెలియదని సురభి సోదరుడు సౌరభ్ చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య తమ చిన్న సోదరి నిషను వరుడికి ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చిందన్నారు. రెండు వైపులా చర్చించుకుని అంగీకారానికి వచ్చారన్నారు.
దీంతో సురభి మ్రుతదేహాన్ని పక్క రూములో పెట్టి.. నిషతో మంజేశ్ వివాహం పూర్తి చేశారు. పెండ్లి యాత్ర ముగిశాక సురభి అంత్యక్రియలు నిర్వహించామని సౌరభ్ చెప్పారు.
సురభి మామ అజాబ్ సింగ్ మాట్లాడుతూ.. ఇది తమ కుటుంబానికి క్లిష్ట సమయం అని చెప్పారు. మరణించిన ఒక కూతురు మ్రుతదేహాన్ని రూంలో పెట్టి, మరో కూతురి వివాహం చేస్తామని తామెప్పుడూ అనుకోలేదన్నారు.
టాటా గ్రూప్ చేతికి ఆన్లైన్ సరుకుల బిగ్ బాస్కెట్
సరికొత్త రికార్డు తాకిన నిఫ్టీ…
పేటీఎం భారీ ఐపీవో రూ.21,800 కోట్ల సమీకరణ
ఎన్ఐఏ అదుపులో అనుమానిత ఐసిస్ ఉగ్రవాది
రాబర్ట్ వాద్రాకు ఊరట : ఐటీ నోటీసులపై బదులిచ్చేందుకు మరో మూడు వారాల గడువు
31 కోట్లతో డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న బిగ్ బీ
ఆయన ఓ ఫైవ్ స్టార్ పొలిటీషియన్ : బీజేపీ
2డీజీ డ్రగ్ సాచెట్ ఖరీదు రూ 990
జాతీయ జెండాను కేజ్రీవాల్ అవమానించారు : కేంద్రమంత్రి
corona helpline : కరోనా బాధితుల కోసం హెల్ప్లైన్ నంబర్లు ఇవే..