హైదరాబాద్: యాస్ తుఫాను కారణంగా రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 59 రైళ్లను రద్దుచేయగా, తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఇవన్నీ దక్షిణమధ్య రైల్వే మీదుగా ఇతర రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైళ్లని, ఈనెల 24వ తేదీ నుంచి 30 వరకు ఈ రైళ్లను నడవవని పేర్కొంది.