‘స్వచ్ఛ సర్వేక్షణ్'పై అవగాహన సదస్సు

సిద్దిపేట కలెక్టరేట్ : సిద్దిపేట పట్టణంలోని సమీకృత మార్కెట్, నర్సపురం ఎక్స్రోడ్, మహాత్మగాంధీ విగ్రహం, పాత బస్టాండ్, ముస్తాబాద్ క్రాస్రోడ్లో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ సర్వేక్షణ్ -2021లో భాగంగా కళాజాతర అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డా.రమణాచారి సూచనలతో నిర్వహించామన్నారు. కళాజాతరలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ రఘువరన్, మెప్మా టీఎంసీ సాయికృష్ణ, సానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ, కళాంజలి రాజేశ్ కళాబృందం, బిల్ కలెక్టర్లు రాజు, రాజేశ్వర్, మల్లేశం, షాబుద్దీన్, శ్రీకాంత్, చంద్రశేఖర్, శేఖర్, ఎల్లం, రామకృష్ణ, శ్రీనివాస్, ఐలయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్
- చలో పెద్దగట్టు.. లింగమంతుల జాతర నేడే ప్రారంభం
- అత్యవసర వినియోగానికి జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్కు అనుమతి