Siddipet
- Nov 26, 2020 , 00:15:20
నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి

- ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
- 17 మంది లబ్ధిదారులకు రూ.6,11,500 చెక్కుల అందజేత
సిద్దిపేట కలెక్టరేట్: సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని తన నివాసంలో 17 మంది లబ్ధిదారులకు రూ.6,11,500 సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందన్నారు. పట్టణానికి చెందిన 9 మందికి రూ.4,55,500, సిద్దిపేట రూరల్ మండలంలోని ఒక్కరికి రూ.12,500, చిన్నకోడూరు మండలంలోని ఇద్దరికీ రూ.30 వేలు, నంగునూరు మండలంలోని ముగ్గురికి రూ. 75,500, నారాయణరావుపేట మండలంలోని ఇద్దరికి రూ.38,500 చొప్పున చెక్కులను అందజేశారు. చెక్కులను లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాల్లో జమచేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- గ్లోబల్ ఐటీ దిగ్గజంగా టీసీఎస్!
- ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ..!
- టిక్టాక్ సహా 59 చైనా యాప్లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
MOST READ
TRENDING